అమరావతే ఏపీ ఆత్మగౌరవం
జగన్ పాలనపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత అమరావతి, కొత్తస్వరం : అమరావతి రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు, అమరావతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని హోంమంత్రి అనిత విమర్శించారు. ఈ కారణంగా రాష్ట్రం విలువైన సమయాన్ని కోల్పోయిందని ఆరోపించారు. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులతో...