మహిళల భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
నంద్యాల, కొత్తస్వరం మహిళల భద్రత, విద్యార్థుల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలపై నంద్యాల జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, శక్తి బృందం సభ్యులు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లు, షాపింగ్ మాల్స్, కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలతో పాటు జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో ప్రత్యేక...