కమిషనర్‌ చల్లా ఓబులేసు స్వాగతం

కర్నూలు, కొత్త‌స్వ‌రం : రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా కర్నూలు నగరపాలక సంస్థకు మంజూరు చేసిన ఈ–ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఘన స్వాగతం పలికారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద చైర్మన్‌ పట్టాభిరామ్‌ను కమిషనర్‌ ఓబులేసు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలిపారు. అనంతరం ఈ–ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, నగరంలో పారిశుధ్య నిర్వహణకు చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు తెలిపారు.