కరీంనగర్, ఫిబ్రవరి 16 (కొత్తస్వరం) :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలకు పురుగుల మందు తాగించి, తర్వాత తల్లి కూడా తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ముగ్గురు మృతి చెందారు. తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.