- 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న అధికారులు
- అమరావతిలో రెండో రోజు సమావేశం
- శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం
- మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష
- రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచన
కర్నూలు, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
అమరావతిలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఐఏఎస్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.
