Homeఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఆధ్వర్యంలో గుంటూరులో టోలిక్ (TOLIC) సమావేశం
గుంటూరు, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఆధ్వర్యంలో 'టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ' (టోలిక్) హిందీ సమావేశం బుధవారం గుంటూరులోని కన్నవారితోట జీఎస్టీ భవన్లో నిర్వహించారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రిచర్డ్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దైనందిన కార్యకలాపాల్లో హిందీ భాష వినియోగాన్ని...
మిట్టకందాల గ్రామంలో ‘మీ భూమి–మీ హక్కు’ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
పాములపాడు, కొత్తస్వరం :
పాములపాడు మండలంలోని మిట్టకందాల గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి జి. హరిప్రసాద్ యాదవ్, తహసీల్దార్ జి. సుభద్రమ్మ, డీటీ పఠాన్ బాబు, ఆర్ఐ డి. ఖాజాబీ, డీవీఎంసీ సభ్యుడు లింగాల...
అమరావతే ఏపీ ఆత్మగౌరవం
జగన్ పాలనపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత
అమరావతి, కొత్తస్వరం : అమరావతి రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు, అమరావతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని హోంమంత్రి...
మహిళల భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
నంద్యాల, కొత్తస్వరం
మహిళల భద్రత, విద్యార్థుల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలపై నంద్యాల జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, శక్తి బృందం సభ్యులు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత...

