- రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
- చంద్రావతి కల్యాణ మండపంలో పాల్గొన్న 1,500 మంది మహిళలు
- ప్రతి మహిళకు కలశం ఏర్పాటు చేసి వ్రతాల నిర్వహణ
- భక్తులకు చీర, రవికె, పూలు, గాజులు అందజేత
- ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు
కొత్త స్వరం, నంద్యాల, ఆగస్టు 21: రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. చంద్రావతి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న వరలక్ష్మీ వ్రతాల్లో 1,500 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ కలశాలు ఏర్పాటు చేసి వ్రతాలను నిర్వహిస్తున్నారు. వ్రతాల్లో పాల్గొనే భక్తులకు చీర, రవికె, పూలు, గాజులు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
