- మెదక్ జిల్లా పర్యటనలో మల్లన్న
- నర్సాపూర్, శివంపేట, రుస్తుంపేటలో జెండాల ఆవిష్కరణ
- బీసీల రాజ్యాధికారమే లక్ష్యమని వెల్లడి
- గ్రామ గ్రామాన విస్తరిస్తున్న టీఆర్పీ
- పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానిక నాయకులు, కార్యకర్తలు
కొత్త స్వరం, మెదక్, ఆగస్టు 21: మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నర్సాపూర్, శివంపేట, రుస్తుంపేట గ్రామాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాలను పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. ప్రజల ఆశయాల సాధన కోసం, బీసీల రాజ్యాధికార లక్ష్యంతో టీఆర్పీ గ్రామ గ్రామాన విస్తరిస్తోందని మల్లన్న తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
